రామచంద్రాపురం మండలం సొరకాయల పాల్యం రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నెంబర్ 133 ప్రభుత్వ భూములో గత కొద్ది రోజులకు ముందు ఓరియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రహరీ గోడను నిర్మించారు. అయితే అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన మండల రెవెన్యూ సిబ్బంది గత నెల 29వ తేదీ జెసిపిల సహాయంతో కూల్చి వేశారు. అయితే పది రోజులు కూడా గడవకమునుపే బుధవారం తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభుత్వ భూమిలో ప్రహరీ గోడ నిర్మించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తిరిగి మరల మండల తాసిల్దార్ కు సమాచారం అందించారు. దీనిపై మండల తాసిల్దార్ మీడియాతో మాట్లాడుతూ 133 ప్రభుత్వ భూములో అక్రమంగా నిర్మించుకుంటున్న ప్రహరీ గోడను తమ సిబ్బందితో ఈరోజే కూల్చి వేస్తామని అన్నారు. మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.