PM Modi: గుజరాత్లోని భరూచ్లో ప్రధాని మోదీ పర్యటించారు. భరూచ్లో రూ. 8 వేల కోట్లతో వివిధ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్స్ కారణంగా 40-50 ఏళ్ల సమయం వృథా అయ్యిందని వ్యాఖ్యానించారు. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి ప్రస్తావించి.. మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ప్రధానాంశాలు:
- గుజరాత్లోని భరూచ్లో ప్రధాని మోదీ పర్యటన
- రూ. 8 వేల కోట్లతో వివిధ పథకాలు ప్రారంభం
- అర్బన్ నక్సల్స్ కారణంగా టైం వృథా అయ్యిందని వ్యాఖ్య