CM stalin: హిందీని మాపై బలవంతంగా రుద్దడం ఆపండి: కేంద్రానికి స్టాలిన్ వార్నింగ్

S7 News
0

 


తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM stalin) కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. హిందీ తమపై తప్పనిసరి చేసి.. మరో భాషా యుద్ధానికి శ్రీకారం చుట్టవద్దని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన లేఖ రాశారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, అన్ని భాషలను సమానంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని ఆపాలని ప్రధాన మంత్రి, ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం నుంచి కూడా ఇదే స్పందన వచ్చింది.


ప్రధానాంశాలు:

  • కేంద్రానికి సీఎం స్టాలిన్ లేఖ
  • హిందీని తప్పనిసరి చేయవద్దని వినతి
  • మరో భాషా యుద్ధాన్ని తీసుకురావొద్దన్న స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM stalin) మరోసారి హిందీ భాషకు (Hindi) వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. హిందీ భాషనుబలవంతంగా తమపై రుద్దవద్దని.. హెచ్చరిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. IITల వంటి సాంకేతిక, సాంకేతికేతర ఉన్నత విద్యా సంస్థలలో బోధనా మాధ్యమం హిందీ (హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో) ఉండాలని, ఇతర ప్రాంతాల్లో సంబంధిత స్థానిక భాషగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన కొద్ది గంటలకే స్టాలిన్ ఈ లేఖ రాశారు. అందులో హిందీని తప్పనిసరి చేస్తూ మరో భాషా యుద్ధానికి తావివ్వవద్దని కోరారు.
"భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అన్ని భాషలను సమానంగా చూడాలి. అన్ని భాషలను అధికార భాషలు అనే స్థాయికి మనం రావాలి. హిందీని రుద్దడం ద్వారా మరో భాషా యుద్ధం తీసుకు రావొద్దు. హిందీని తప్పనిసరి చేయడాన్ని ఆపాలని ప్రధాన మంత్రి, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. భారతదేశ ఐక్యతను కాపాడండి." అని స్టాలిన్ లేఖలో కోరారు.
తమిళనాడు మాత్రమే కాదు మాతృభాషను గౌరవించే ఏ రాష్ట్రమైనా ఇలాంటి చర్యను వ్యతిరేకిస్తుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని అధికార భాషపై పార్లమెంట్ కమిటీ గత నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించిన నివేదికను కూడా ఆయన ప్రస్తావించారు. ఆ కమిటీ హిందీని సాధారణ భాషగా సిఫార్సు చేసిందని, హిందీ బోధనా భాషగా ఉండాలని పిలుపునిచ్చిందని స్టాలిన్ అన్నారు. ఇది విభజించు, పాలించు లాంటి విధానమేనని స్టాలిన్ విమర్శించారు.

మరోవైపు హిందీ భాషకు సంబంధించి కమిటీ సిఫార్సులను కేరళలో కూడా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ భాషా వైవిధ్యానికి విరుద్ధంగా ఉందని ప్రభుత్వం విమర్శించింది. దేశ వైవిధ్యంపై బీజేపీకి నమ్మకం లేదని సీనియర్ లెఫ్ట్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఐజాక్ అన్నారు. "ఒక దేశం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనే ఆర్ఎస్ఎస్ భావన నుంచి వచ్చిన ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, మన దేశ భాషా వైవిధ్యానికి విరుద్ధంగా నడుస్తుంది" అని సీపీఎం పార్టీ ట్వీట్ చేసింది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top