దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక సైనికులు నిరంతరం సరిహద్దుల్లో కాపాలా కాస్తున్నారు. మాతృదేశం కోసం వారికి ఉన్న నిబద్దతే ప్రజలను ప్రశాంతంగా ఉండేలా చేస్తోంది. అయితే, కేవలం సైనికులే కాదు జాగిలాలు కూడా దేశం కోసం తామ ప్రాణాలు కూడా లెక్కచేయమని నిరూపించే ఘటన ఇది. రెండు రోజుల కింద కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. దీని వెనుక ఓ జాగిలం సాహసం ఉంది.
ప్రధానాంశాలు:
- అనంత్నాగ్లో రెండు రోజుల కింద ఎన్కౌంటర్
- ముష్కరులిపై జాగిలాన్ని వదిలిన సైనికులు
- కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జూమ్ జాగిలం.