తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 26 వ మలుపు వద్ద నిలిచి ఉన్న వాహనాన్ని మరో వాహనం డీ కొట్టింది. ఈ ఘటనలో ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం కారులో తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోంది. విషయం తెలుసుకున్న మోకాళ్ళ మిట్ట, 35వ మైలు వద్ద ఉన్న రెండు 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.